శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్య లహరి మహా సంస్థాన ఆశ్రమం ఓం శివ శక్తి పీఠం

శ్రీశ్రీశ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సౌందర్యలహరి మహా సంస్థాన ఆశ్రమమువారిచే “ఓం శివశక్తిపీఠం” ఆధ్వరంలో అత్యద్బుత, శిలాఖండాలతో శైవ, వైష్టవ, ఆగమశాస్త్రాలను అనుసరించి మరియు స్వయంభూగా వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు, ఎందరో ఆదిగురువులు, సిద్ధ గురువులు, రాజయోగులు, పీఠాధిపతులు, మఠాధిపతులు, యంత్ర-మంత్రం-తంత్రములతో నిర్మించి నిత్య కార్యక్రమములు, అగ్నిహోత్రములు చేస్తున్నారు. వాటి ఆలయ నమూనాలు, మూలవిరాఠ్ నమూనాల దేవతల స్వరూపాలు అనుసరించి “ప్రపంచ శాంతి కోసం, దేశ సౌభాగ్యం కోసం, ప్రకృతి వైపరీత్యాలనుండి రక్షించడం కోసం, భూలోకంలో పాడిపంటలతో సస్యశ్యామలముగా ఉండడం కోసం, లోక కళ్యాణార్ధం మానవాళిని ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, శాంతియుతంగా, ప్రేమయుతంగా జీవించడం కోసం, ధన ధాన్యాలు, సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఇష్ట కార్యసిద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి, విద్య, ఉద్యోగం, వ్యాపార, ఐశ్వర్య ఫలసిద్ది, పాడిపంటల ఫలసిద్ది, విద్యాబుద్దులు, వివాహ, సంతానసౌఖ్యం, కుటుంబ సౌఖ్యం కలుగజేయడం కోసం “గానాభాద్యం” సౌర్యం, శైవం, వైష్టవం, కౌమారం, శాక్తేయం హిందూ మతంలో ఉండే అన్ని దేవతలకు విడివిడిగా ఆలయాలు లోకంలో ఉండే షణ్ముద దేవతల వేద శివాగమ శిల్ప శాస్త్రము ననుసరించి నిర్మించిన మహా విశిష్ట పుణ్యక్షేత్రం.
View More